Posts

Showing posts with the label virus

పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

Image
  పూరీ ఆలయంలో ఇ లా జరిగిందేంటి... ?   ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. " 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ , పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు , భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు.   ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింది ఒడ

భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం…!

Image
  భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం …! భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వూహాన్‌ కేంద్రంగా ' క్యాట్ క్యూ ' అనే వ్యాధిని వైద్య అధికారులు గుర్తించారు. దీని కారణంగా మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దోమలు , పందులను వాహకాలుగా చేసుకొని ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. మన దేశంలో ఇది ఎంత మందిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.   చైనా , తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇటీవల ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో భారత్‌లో కొన్ని శాంపిళ్లను ఐసీఎంఆర్ సేకరించింది. దేశవ్యాప్తంగా 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా , రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.   వీటిలో నేరుగా వైరస్ మాత్రం కనిపించలేదు. దీంతో మరికొంత మంది శాంపిళ్లను పరీక్షించాలని అభిప్రాయపడ్డారు. మలేరియా , డెంగీ , హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. కాగా మన దేశంలో క్యూలెక్స్ దోమలు , ప

వాట్సాప్‌ను వణికిస్తున్న 'టెక్ట్స్‌ బాంబ్స్‌'

Image
సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్‌ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్‌ యూజర్స్‌కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్‌ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్‌ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ ( Scarry Messages) వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో ( WABetaInfo) తెలిపింది. ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు వెల్లడించింది.   కొద్ది రోజుల కిత్రం వాట్సాప్‌ ఐఓఎస్‌ , ఆండ్రాయిడ్ యాప్‌లలో ఎలాంటి కొత్త ఫీచర్స్‌ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది. అందులో ఒకరు తనకు టెక్ట్స్‌ బాంబ్‌ సందేశాలు వస్తున్నాయని ట్వీట్ చేశారు. దీనిపై వాబీటాఇన్ఫో స్పందిస్తూ '' కొద్ది వారాల క్రితమే దీని గురించి మేం ప్రస్తావించాం. మా ఫాలోవర్స్‌లో కొంత మంది దీన్ని బినారియో , కాంటాక్ట్ బాంబ్స్‌ , ట్రావా జాప్‌ , క్రాషర్స్‌ , వికార్డ్ క్రాష్‌ , టెక్ట్స్‌ బాంబ్ '' అని పిలుస్తారని తెలిపింది. దీని