Posts

Showing posts with the label army

పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.

Image
  పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్‌ జిల్లా మాన్‌కోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి , మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాక్‌ కాల్పులకు తెగబడుతూ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కొంతకాలంగా పూంచ్‌ , రాజౌరీ జిల్లాల్లో భారత పౌరులు , సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు , ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా రామ్‌పూర్ సెక్టార్‌లోనూ ఇటీవల పాక్‌ సైన్యం కాల్పులు జరపగా భారత్ ధీటుగా బదులిచ్చింది.

సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...!

Image
  సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...! లడఖ్‌ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద భారతీయ , చైనా దళాల మధ్య ఉద్రిక్తతల మధ్య , చైనా తన సైనికులను ఎల్‌ఐసి సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం (సెప్టెంబర్ 7), చుషుల్ వద్ద ఉన్న ముఖ్రి ప్రాంతానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారత సైన్యం విజయవంతమైంది.   అయితే రాబోయే రోజుల్లో చైనా నుండి ఇలాంటి మరిన్ని చర్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్మీ పేర్కొంది. సెప్టెంబర్ 1 న , చైనా ఎల్‌ఐసి వద్ద రెచిన్ లా సమీపంలో పిఎల్‌ఎ గ్రౌండ్ ఫోర్స్ చెందిన బెటాలియన్‌ ను చైనా మోహరించింది. అలాగే స్పాంగూర్ సరస్సు సమీపంలో రెండు బెటాలియన్లను కూడా మోహరించింది.   ఇవన్నీ శిక్వాన్ వద్ద ఉన్న 62 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లో భాగం అని అధికారులు పేర్కొన్నారు.