Posts

Showing posts with the label TS news

ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా...! | Corona to half the population by February

  ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా ...! భారత జనాభాలో కనీసం సగం మందికి వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా సోకే ప్రమాదముందని కరోనా వైరస్ ‌ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్ ‌ వెల్లడించారు . ఇప్పటి వరకు దేశంలో 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి . పాజిటివ్ ‌ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం భారత్ ‌ దే . సెప్టెంబర్ ‌ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని , సగటున రోజూ 61,390 కొత్త కేసులు నమోదౌతు న్నాయని తెలిపారు . మేం అనుసరించిన మోడల్ ‌ అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఇప్పుడు దాదాపు 30 శాతం జనాభా కరోనా బారిన పడ్డారు , ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరవచ్చు ’ అని ప్రభుత్వ కమిటీ సభ్యులు , కాన్పూర్ ‌ ఐఐటికి చెందిన మణీంద్ర అగ్రవాల్ ‌ తెలిపారు . కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ ‌ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ఈ కమిటీ అంచనా వేసింది . అతి తక్కువ జనాభాతో సర్వే చేయడంతో , సీరోలాజికల్ ‌ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా లేవని అగ్రవాల్ ‌ తెలిపారు

విద్యాసంస్థలో ఓ ప్రభంజనం ఐఏఆర్ఈ...! | IARE is a discipline in education

  విద్యాసంస్థలో ఓ ప్రభంజనం ఐఏఆర్ఈ ...! విజ్ఞతకు , విద్యా సంపదకు కేరాఫ్ ‌ అడ్రస్ ‌ గా చెప్పుకునే ఐఏఆర్ ‌ ఈ ఏరోనాటికల్ ‌ ఇంజనీరింగ్ ‌ లో అగ్రగామిగా నిలిచింది . 16.72 ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్ ‌, డిజిటల్ ‌ లైబ్రరీతో హైదరాబాద్ ‌ లో 2000 సంవత్సరంలో స్థాపించారు . దేశంలోని 300 బెస్ట్ ‌ కాలేజీలో స్థానం దక్కించుకుంది . ఈ సంస్థ ' మారుతి ఎడ్యుకేషనల్ ‌ సొసైటీ ' ఆధ్వర్యంలో కొనసాగుతోంది . దీనిని ఎడ్యుకేషన్ ‌ ఫర్ ‌ లిబరేషన్ ‌  అనే మిషన్ ‌ తో విద్యావ్యవస్థలో సుదీర్ఘమైన , అత్యుత్తమ అనుభవం కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తల బందం ఏర్పాటు చేసింది . తెలంగాణ రాష్ట్రంలో ఏరోనాటికల్ ‌ ఇంజనీరింగ్ ‌ విభాగంలో బీటెక్ ‌ ప్రోగ్రాంను మొదటగా ప్రారంభించిన ఈ సంస్థ క్రమంగా సమగ్ర బహుళ - క్రమశిక్షణా సాంకేతిక సంస్థగా మారిపోయింది . ఏరోనాటికల్ ‌ ఇంజనీరింగ్ ‌ లో 4952 మంది విద్యార్థులుండగా , 275 మంది అత్యుత్తమమైన ఫ్యాకాల్టి ఉంది . 30 శాతం మంది పీహెచ్ ‌ డీ చేసిన బృందంతో కొనసాగుతోంది . రెండు స్టుడియోలు , 6 సెమినార్ ‌ హాల్స్ ‌, 4 కాన్ఫరెన్స్ ‌ రూంలున్నాయి . కాలేజీకి