Posts

Showing posts with the label mantram

మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా...!

Image
  మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా ...! ఈ ఏడాది మార్చి1వ తేదీ, మంగళవారం వస్తోంది. దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం భక్తులు లింగరూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు , పండ్లరసాలు, వివిధద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో శివ పార్వతుల కళ్యాణం జరుపుతారు. పరమ శివుడ్ని ప్రసన్నం చేసుకోటానికి జ్యోతిష్య శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయని రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్ లో ఉన్న కల్లాజీ వేద విశ్వవిద్యాలయం జ్యోతిషశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయ్ తివారీ తెలిపారు. మేషాది ద్వాదశ రాశులవారు ఈ క్రింద చెప్పబడిన ఆ రాశికి సూచించిన మంత్రాలతో మహా శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుందని తివారీ తెలిపారు. మేషరాశి : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తికొలదీ పూజించి, "ఓం మమలేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వృషభం : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్ర